టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు

ABN , First Publish Date - 2021-11-06T14:59:19+05:30 IST

వరిపంటను తాము చెప్పినప్పుడే కోయాలని రైతులకు మునుపెన్నడూ లేనివిధంగా అధికారులు హుకుం జారీ చేశారు. ఇదీ ఇలా ఉండగా, గరిడేపల్లి మండల వ్యవసాయ

టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు

సూర్యాపేట: వరిపంటను తాము చెప్పినప్పుడే కోయాలని రైతులకు మునుపెన్నడూ లేనివిధంగా అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో కొన్ని చోట్ల రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఇలా ఉండగా, గరిడేపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి కార్యాలయం ముందు నిలబడలేక రైతులు క్యూలైన్లో పాస్ బుక్స్ ఉంచారు.

Updated Date - 2021-11-06T14:59:19+05:30 IST