వ్యవసాయ కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-10-19T03:29:21+05:30 IST

స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు.

వ్యవసాయ కార్యాలయం ముట్టడి
కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతులు

ఉదయగిరి(ఉదయగిరి రూరల్‌), అక్టోబరు 18: స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని  ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ఉదయగిరి యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రకారం సజ్జలను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. పెంచిన గ్యాస్‌, డీజలు, పెట్రోలు నిత్వావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు హజరత్తయ్య, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T03:29:21+05:30 IST