రైతులు బోర్ల కింద వరి సాగు చేయొద్దు

ABN , First Publish Date - 2021-06-23T05:17:20+05:30 IST

రైతులు బోర్లు కింద వరి సాగు చేయవద్దని రాజమహేంద్రవరం రూరల్‌ మండల వ్యవసాయాఽధికారి కె.శ్రీనివాస్‌ తెలిపారు.

రైతులు బోర్ల కింద వరి సాగు చేయొద్దు

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 22: రైతులు బోర్లు కింద వరి సాగు చేయవద్దని రాజమహేంద్రవరం రూరల్‌ మండల వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో పలుచోట్ల కౌలురైతుల అవగాహన సదస్సులు మంగళ వారం జరిగాయి. రూరల్‌ మండలం కాతేరులోని రైతుభరోసా కేంద్రంలో జరి గిన సదస్సులో ఏవో మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు పండించుకోవాలని, బోర్ల కింద వరి సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదముందన్నారు. కౌలురైతులకు ఇచ్చే కార్డుల వల్ల భూయజమానులకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు పీటర్‌, వేణుమాధవరావు, వీఓఏలు కాశీవిశాలాక్షి, రమాదేవి, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:17:20+05:30 IST