మాచాపూర్‌లో ‌చేపలు పట్టడాన్ని అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2021-01-27T21:09:56+05:30 IST

తమ పట్టా భూమిలోని కుంటలో చేపలు పట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు.

మాచాపూర్‌లో ‌చేపలు పట్టడాన్ని అడ్డుకున్న  రైతులు

సిద్దిపేట: తమ పట్టా భూమిలోని కుంటలో చేపలు పట్టడాన్ని రైతులు అడ్డుకున్నారు. చిన్నకోడూర్ మండంలోని మాచాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో ఉన్న ముద్దంకుంటలో చేపలు పట్టడానికి  ముదిరాజ్ కులస్థులు వెళ్లారు. అయితే ముద్దంకుంట తమ పట్టా భూమిలో ఉందని చేపలు పట్టడానికి వీల్లేదని స్థానిక రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం తమకు న్యాయం చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయంలో  రైతులు వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - 2021-01-27T21:09:56+05:30 IST