ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

ABN , First Publish Date - 2021-05-07T03:47:39+05:30 IST

రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బసినేనిపల్లి రైతు భరోసా కేంద్రం ఎదుట గురువారం రైతులు ఆందోళన

ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన
బసినేనిపల్లి రైతుభరోసా కేంద్రం దగ్గర ఆందోళన చేస్తున్న రైతులు

సీతారామపురం, మే 6 : రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బసినేనిపల్లి రైతు భరోసా కేంద్రం ఎదుట గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లా రైతు సంఘం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలను సడలించి రైతు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అధికార యంత్రాంగం రైతులకు కల్లబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నా రన్నారు. అకాల వర్షాలకు కళ్లాల్లో పోసిన ధాన్యపు రాసులు తడిసి దెబ్బతినే పరిస్థితులు ఉండటంతో అధికారులు స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు కోడె రమణయ్య, నాగూర్‌సాహెబ్‌, వెంకటేశ్వరరెడ్డి పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T03:47:39+05:30 IST