397వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

ABN , First Publish Date - 2021-01-17T13:28:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు...

397వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి 397వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ రైతుల ఉద్యమం కొనసాగుతోంది.

Updated Date - 2021-01-17T13:28:11+05:30 IST