రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-05-05T07:06:11+05:30 IST
అకాల వర్షానికి ధాన్యం తడిసిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి కోడారు.
రామన్నపేట: అకాల వర్షానికి ధాన్యం తడిసిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి కోడారు. మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శ్యాం సుందర్రావు పరిశీలించి మాట్లాడగా, రామన్నపేటలో నిర్వహించిన రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో అశోక్రెడ్డి మాట్లాడారు. కొను గోలు కేంద్రాల్లో కాంటాలు వేయడంలో జాప్యం జరిగినందునే వరైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పోయిన వరి, మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు నకిరే కంటి మొగులయ్యా, బందార్పు లింగస్వామి, వెంకటేశ్వరాచారి, గార్దసు సురేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బోయిన ఆనంద్, నాగటి ఉపేందర్, యాదాసు యాదయ్య, కల్లూరి నగేష్, సోములు పాల్గొన్నారు.