సీఆర్డీఏ అధికారులను అడ్డుకున్న రైతులు
ABN , First Publish Date - 2020-04-07T17:41:16+05:30 IST
గుంటూరు: మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆర్5 జోన్పై ప్రజాభిప్రాయ సేకరణకు సీఆర్డీఏ అధికారులు వెళ్లారు.
గుంటూరు: మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆర్5 జోన్పై ప్రజాభిప్రాయ సేకరణకు సీఆర్డీఏ అధికారులు వెళ్లారు. వారిని రైతులు, జేఏసీ నేతలు అడ్డుకున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో సీఆర్డీఏ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.