సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-04-09T10:37:59+05:30 IST
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. పీఏసీఎస్ రేజర్ల
సత్తుపల్లి, ఏప్రిల్ 8: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. పీఏసీఎస్ రేజర్ల ఆధ్వర్యంలో కొత్తూరులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం సేకరణ కేంద్రంను ఆమె బుధవారం ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్ రూ.1835, కామన్ గ్రేడ్ రూ.1815గా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో దిశా సభ్యులు, కొత్తూరు సర్పంచ్ ఒగ్గు విజయలక్ష్మీ, ఎంపీటీసీ ఇస్సంపల్లి వెంకటేశ్వరరావు, ఏవో వై.శ్రీనివాసరావు, ఏఈవో ఎస్కే.రీమా, దొడ్డా శంకరరావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు.