కరోనా దెబ్బకు రైతన్న కన్నీరు పెడుతుంటే..: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2020-04-01T20:10:38+05:30 IST
విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు...
అమరావతి: విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు...రైతు రాజ్యం తెస్తా అన్నట్టుంది జగన్ పాలన అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఏడాదిలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు ఏడాదికి రూ. లక్ష ఇస్తామని గాలి హామీలిచ్చారని విమర్శించారు. కరోనా దెబ్బకు రైతన్న కన్నీరు పెడుతుంటే... పొగడ్తలకు తప్ప... రైతులను పట్టించుకునే తీరికలేదు పబ్జీరెడ్డికి అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.