మోజుతీర్చుకుని వదిలేశాడు..పోలీసులను ఆశ్రయించిన యువతి

ABN , First Publish Date - 2020-08-03T21:53:20+05:30 IST

ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

మోజుతీర్చుకుని వదిలేశాడు..పోలీసులను ఆశ్రయించిన యువతి

రంగారెడ్డి: ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు నెలలు కలిసి కాపురం చేశాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం బహదూర్‌గూడకు చెందిన ఫోటోగ్రాఫర్ రాజ్ కుమార్, కుషాయిగూడకు చెందిన ఓ ఆర్కెస్ట్రా డ్యాన్సర్ దీపిక ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ శంషాబాద్ ఆర్టీనగర్ కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని నాలుగు నెలలు కాపురం చేశారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాజ్ కుమార్ మరోయువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న దీపిక అతనిని నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. రాజ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Updated Date - 2020-08-03T21:53:20+05:30 IST