40 ఏళ్ల మహిళ నిర్వాకం.. ఐదేళ్ల కొడుకును ఐదు ముక్కలుగా చేసిన 28 ఏళ్ల తండ్రి.. ఈ ఘోరం వెనుక కథేంటంటే..

ABN , First Publish Date - 2021-12-04T20:58:14+05:30 IST

అతను ఓ గ్రామంలో రైతు.. నలుగురు పిల్లలకు తండ్రి.. చిన్నవాడైన ఐదేళ్ల కొడుకు ఆరోగ్యం అతడిని వేధించసాగింది..

40 ఏళ్ల మహిళ నిర్వాకం.. ఐదేళ్ల కొడుకును ఐదు ముక్కలుగా చేసిన 28 ఏళ్ల తండ్రి.. ఈ ఘోరం వెనుక కథేంటంటే..

అతను ఓ గ్రామంలో రైతు.. నలుగురు పిల్లలకు తండ్రి.. చిన్నవాడైన ఐదేళ్ల కొడుకు ఆరోగ్యం అతడిని వేధించసాగింది.. ఆ చిన్నారిని ఓ మహిళ దగ్గరకు తీసుకెళ్లాడు.. ఆమె సూచన మేరకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు.. కన్న కొడుకును గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికేసి సమీపంలోని పొలంలో పాతిపెట్టేశాడు.. విషయం పోలీసులకు తెలియడంతో కటకటాలు లెక్కపెడుతున్నాడు.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


అలీరాజ్‌పూర్‌కు చెందిన దినేష్ ‌అదే ఊరిలో వ్యవసాయం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్నవాడైన ఐదేళ్ల కొడుకు అనారోగ్యానికి గురి కావడం అతడిని కలిచివేసింది. మూఢ నమ్మకాలు కలిగిన దినేష్ తన కొడుకును దెయ్యం వెంటాడుతోందని బలంగా నమ్మాడు. ఆ చిన్నారిని ఓ 40 ఏళ్ల మహిళా తాంత్రికురాలి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ చిన్నారిని ఐదు భాగాలుగా నరికేసి గోతిలో పూడ్చి పెట్టమని ఆ తాంత్రికురాలు చెప్పింది. 


తాంత్రికురాలి సూచన మేరకు దినేష్ తన కొడుకు శరీరాన్ని గొడ్డలితో ఐదు భాగాలు చేసి వాటిని సమీపంలోని పొలంలో పాతి పెట్టేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్‌ను అరెస్ట్ చేశారు. తాంత్రికురాలి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. 

 

Updated Date - 2021-12-04T20:58:14+05:30 IST