విషాదం: లారీ ఢీకొని తండ్రి, కుమార్తె మృతి

ABN , First Publish Date - 2020-09-26T19:56:50+05:30 IST

బాపులపాడు మండలం కానుమోలు గ్రామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పైన ప్రయాణిస్తున్న తండ్రి, కూతురుపైకి లారీ దూసుకెళ్లింది

విషాదం: లారీ ఢీకొని తండ్రి, కుమార్తె మృతి

కృష్ణాజిల్లా: బాపులపాడు మండలం కానుమోలు గ్రామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పైన ప్రయాణిస్తున్న తండ్రి, కూతురుపైకి లారీ దూసుకెళ్లింది. సంఘటనా స్థలంలోనే తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. మృతులు దాసరి లెలిన్(53), వంజరపు దేవి( 32)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2020-09-26T19:56:50+05:30 IST