ఆస్తికోసం కన్నకొడుకునే కడతేర్చిన తండ్రి.. సుత్తితో తలపై బాది..

ABN , First Publish Date - 2020-08-15T03:45:28+05:30 IST

ఆస్తి కోసం కన్న తండ్రే కసాయిగా మారాడు. కొడుకును అత్యంత కిరాతకంగా సుత్తితో తలపై బాది హతమార్చాడు. దిగ్భ్రాంతికి గురిచేసే...

ఆస్తికోసం కన్నకొడుకునే కడతేర్చిన తండ్రి.. సుత్తితో తలపై బాది..

అమరావతి: ఆస్తి కోసం కన్న తండ్రే కసాయిగా మారాడు. కొడుకును అత్యంత కిరాతకంగా సుత్తితో తలపై బాది హతమార్చాడు. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ సంఘటన విశాఖపట్నంలోని చిన ముషిదివాడ పరిసరాల్లోని సత్యనగర్‌‌లో చోటు చేసుకుంది. విశాఖపట్నం పశ్చిమ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీర్రాజు అనే వ్యక్తి తన కొడుకు జలరాజుతో కలిసి నివశిస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. హత్య జరగడానికి ముందు తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కొడుకు జలరాజు కూర్చుని ఉండగా తండ్రి వీర్రాజు వెనకనుంచి సుత్తితో దాడి చేశాడు. తలపై బలంగా బాదడంతో జలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రాకార్డయ్యాయి.


కొడుకును చంపిన అనంతరం వీర్రాజు తనంతతానుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసి వీర్రాజును అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు గురువారం తీర్పు చెప్పారు. ఈ ఘటనతో చుట్టుపక్కల వారంతా షాక్‌కు గురయ్యారు.

Updated Date - 2020-08-15T03:45:28+05:30 IST