రాత్రి 2 గంటల సమయంలో శబ్దాలు.. ఉలిక్కిపడి నిద్రలేచిన 6 ఏళ్ల బాలిక.. గదిలో కనిపించిన సీన్ చూసి..

ABN , First Publish Date - 2021-11-04T02:35:18+05:30 IST

ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. ఆమె గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోంచి అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ 6 ఏళ్ల బాలిక ఉలిక్కిపడి నిద్రలేచింది. అక్కడ గదిలో కనిపించిన సీన్ చూసి షాక్‌కు గురైంది. ఇంత

రాత్రి 2 గంటల సమయంలో శబ్దాలు.. ఉలిక్కిపడి నిద్రలేచిన 6 ఏళ్ల బాలిక.. గదిలో కనిపించిన సీన్ చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. ఆమె గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోంచి అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ 6 ఏళ్ల బాలిక ఉలిక్కిపడి నిద్రలేచింది.  అక్కడ గదిలో కనిపించిన సీన్ చూసి షాక్‌కు గురైంది. ఇంతకీ ఆ బాలికకు గదిలో ఏం కనిపించిందంటే..


రాజస్థాన్‌లోని తంబోలియా గ్రామానికి చెందిన 35 ఏళ్ల నరేష్ మీనకు భార్య లక్ష్మి(30), కొడుకు విశాల్(11), ఆరేళ్ల కూతురు, ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నారు. నరేష్ తంబోలియాలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయారు. నరేష్ పెద్ద కొడుకు విశాల్ తండ్రి పక్కనే పడుకోగా, ఇంకో ఇద్దరు పిల్లలతో కలిసి నరేష్ భార్య పక్కన బెడ్ మీద పడుకుంది. రాత్రి 2 గంటల సమయంలో నిద్ర లేచిన నరేష్ పక్కనే నిద్రిస్తున్న విశాల్‌ గొంతు నొక్కి, కత్తితో పొడిచి చంపేశాడు. కొడుకు అరుపులు విన్న తల్లి, పిల్లలు నిద్రలేచేసరికి ఘోరం జరిగిపోయింది. అంతటితో ఆగని ఆ కసాయి తండ్రి ఏడాదిన్నర బాబుని కడుపులో పొడిచాడు. భార్యను తలపై, మెడభాగంలో పొడిచి హత్యాయత్నం చేశాడు.



తండ్రి చేస్తున్న కసాయి పనికి ఆరేళ్ల బాలిక భయపడిపోయింది. అన్న, తల్లి అరపులు విని ఇంటి నుంచి పారిపోయింది. అది గమనించిన తండ్రి ఆ బాలికను కూడా వెంబడించాడు. కానీ ఆమె తప్పించుకుని పక్కనే ఉన్న నానమ్మ ఇంటికి వెళ్లింది. దీంతో నరేష్ అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న బావిలో దూకాడు. బాలిక నానమ్మ, తాతయ్యలతో తండ్రి చేసిన నిర్వాకం గురించి చెప్పగా అది విని వారు నివ్వెరపోయారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా కోడలు, మనవలు రక్తపు మడుగులో కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ విశాల్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషమ పరిస్థితిలో ఉన్న లక్ష్మికి, బాబుకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలించగా పోలీసులకు బావిలో నరేష్ కనిపించాడు. అతడిని బయటకు లాగి అరెస్టు చేశారు. విచారణలో నరేష్ ఆత్మహత్య చేసుకోవాలని బావిలో దూకినట్లు, కానీ  మునిగిపోతుండగా చావు మీద భయంతో మోటార్‌ని పట్టుకుని బావిలోనే ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుండా నాలుగు రోజులుగా భార్య, పిల్లల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆస్తి తగాదాల వల్లే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపారు.




Updated Date - 2021-11-04T02:35:18+05:30 IST