daughter: కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-07-23T16:53:25+05:30 IST

కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో గర్భవతిగా ఉన్న కన్న కూతుర్ని గొంతు కోసి చంపిన....

daughter: కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఏం చేశాడంటే...

ధన్‌బాద్ (జార్ఖండ్): కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో గర్భవతిగా ఉన్న కన్న కూతుర్ని గొంతు కోసి చంపిన కసాయి తండ్రి బాగోతం జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ నగరంలో వెలుగుచూసింది. ధన్‌బాద్ నగర పరిధిలోని ఝరియా టౌన్ షిప్ ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ కు ఖుష్బూ కుమారి అనే 20 ఏళ్ల కుమార్తె ఉంది. ఖుష్బూ కుమారి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న ఆరు నెలలకు ఖుష్బూ కుమారి గర్భం దాల్చింది. వ్యవసాయ క్షేత్రం చూపిస్తానని చెప్పి రాంప్రసాద్ ఖుష్బూకుమారిని ఆటో రిక్షాలో తీసుకొని వచ్చాడు.కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో తండ్రి రాంప్రసాద్ పొలం తీసుకువచ్చి కత్తితో కుమార్తె ఖుష్భూను గొంతు కోసి చంపి పారిపోయాడు. 


రక్తపు మడుగులో పడిన ఖుష్బూ కుమారి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు. కుమార్తెను హతమారుస్తున్నపుడు తల్లి కూడా అక్కడే ఉన్నా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేర తండ్రి రాంప్రసాద్ పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. పరువు కోసం కన్న కుమార్తెను హతమార్చిన కసాయి తండ్రి ఘటన సంచలనం రేపింది.


Updated Date - 2021-07-23T16:53:25+05:30 IST