జడ్పీలో ఇష్టారాజ్యం !

ABN , First Publish Date - 2020-06-04T09:37:42+05:30 IST

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు.

జడ్పీలో ఇష్టారాజ్యం !

విధులకు అకౌంట్స్‌ ఆఫీసర్‌ డుమ్మా.. 

కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లు


అనంతపురం విద్య, జూన్‌ 3 : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. తాము వచ్చినప్పుడే డ్యూటీ రానప్పుడు హాలిడే అన్న చందంగా తయారైంది కొందరి తీరు. కా ర్యాలయంలో ఏఓగా పని చేసే అధికారి విధులకు తరు చూ డుమ్మా కొడుతూనే ఉంటారు. బుధవారం సైతం 11.45 గంటలైనా తలుపులు మూసే ఉన్నా యి. అధికారి లేకున్నా ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూనే కనిపించాయి. పైగా కార్యాలయంలో విధులకు సైతం 5 రోజులుగా గైర్హాజవు తున్నారు. జడ్పీలో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయ నకు డ్వామాలో అడిషనల్‌ పీడీగా విధులు కేటాయించా రు.


ఆయనే జడ్పీలో ఎఫ్‌ఏసీ ఏఓగా కొనసాగుతున్నారు. అయితే ఆయన సమయం అంతా డ్వామాలో కేటాయి స్తుండటంతో జడ్పీ ఉద్యోగం చుట్టపుచూపుగా చూస్తు న్నారనే విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆయన విధులకు డుమ్మా కొడుతుండటంతో ఫీఎప్‌ ఫైళ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఇతర ఫైళ్లది అదే పరిస్థితి. జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు  స్పెషల్‌ ఆఫీసర్‌గా కొనసాగుతున్న జడ్పీలో ఉద్యోగులు చుట్టపుచూపుగా విధులు నిర్వర్తిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి.

Updated Date - 2020-06-04T09:37:42+05:30 IST