ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం లక్ష మాస్కులు
ABN , First Publish Date - 2021-06-22T06:37:22+05:30 IST
జిల్లాలో కొవిడ్-19పై యుద్ధం చేస్తోన్న ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం లక్ష మాస్కులను హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ ఎఫ్సీఎన్ ఇంపెక్స్ ఇండియా ఎల్ఎల్పీ సంస్థ అందదజేసింది.
గుంటూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్-19పై యుద్ధం చేస్తోన్న ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం లక్ష మాస్కులను హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ ఎఫ్సీఎన్ ఇంపెక్స్ ఇండియా ఎల్ఎల్పీ సంస్థ అందదజేసింది. సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ వివేక్యాదవ్కి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఏవీ పటేల్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వి.గోపీకృష్ణ పాల్గొన్నారు.