చీకటిపడితే భయం..భయం
ABN , First Publish Date - 2021-04-19T04:52:36+05:30 IST
చీకటిపడితే భయం..భయం
ఫఏజెన్సీలో ఏనుగుల తిష్ఠ
భామిని: ఏజెన్సీలో చీకటిప డితే ప్రజలు భయాందోళన చెం దుతున్నారు. రాత్రి బిక్కుబిక్కు మని గడుపుతు న్నారు. నెలరో జులుగా ఘనసర, కోసలి, తాలా డలో ఏనుగులు తిష్ఠవేశాయి. మూడురోజులుగా కీసర వైపు సంచరిస్తున్నాయి.ఈనేపథ్యంలో రాత్రి పూట కంటి మీద కునుకు లేకుండాపోతోందని నాలుగు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగులపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని ఎమ్మెల్యేకు గిరిజనులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి చేతులు దులుపుకోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తాము పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు.