నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ ఇంటర్ పరీక్షల ఫీజులు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-04-19T04:10:36+05:30 IST
వచ్చే జూలై నెలలో జరగబోయే ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కావడానికి పరీక్ష ఫీజును సోమవారం 19 నుంచి వచ్చే నెల 10 వరకు చెల్లిం చాలని జడ్పీహెచ్ఎస్ పెద్ద కొడప్గల్ ప్రధానో పాధ్యాయుడు, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ సి.గంగా కిషన్ తెలిపారు.
పెద్ద కొడప్గల్, ఏప్రిల్ 18 : వచ్చే జూలై నెలలో జరగబోయే ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కావడానికి పరీక్ష ఫీజును సోమవారం 19 నుంచి వచ్చే నెల 10 వరకు చెల్లిం చాలని జడ్పీహెచ్ఎస్ పెద్ద కొడప్గల్ ప్రధానో పాధ్యాయుడు, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ సి.గంగా కిషన్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి నమోదు చేసుకున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులే కాకుండా గతంలో నమోదు చేసుకున్న పరీక్ష ఫీజును చెల్లించని వారు కూడా పాఠశాలకు వచ్చి చెల్లించా లన్నారు. అదేవిధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పుస్తకాలను తీసుకుని వాటికి సంబం ధించిన అసైన్మెంట్ వర్క్ను పూర్తి చేసి స్టడీ సెంట ర్లో సమర్పించాలని, వీటికి మార్కులు కేటాయిం చనున్నట్లు తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్ 9866343898కు సంప్రదించాలని సూచించారు.