ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలి: బీజేవైఎం

ABN , First Publish Date - 2021-06-18T04:29:21+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట పూర్తి ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని, 50 శాతం తగ్గించి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగొని సురే్‌షగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలి: బీజేవైఎం
కలెక్టరేట్‌ ఎదుట అధికారులకు వినతిపత్రాన్ని అందజేస్తున్న నాయకులు

సిద్దిపేట క్రైం, జూన్‌ 17: కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట పూర్తి ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని, 50 శాతం తగ్గించి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగొని సురే్‌షగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్‌, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు మనోహర్‌యాదవ్‌, రమేష్‌, జిల్లా కార్యదర్శి రవీందర్‌రెడ్డి, సోషల్‌ మీడియా జిల్లా కో కన్వీనర్‌ నీలం దినేష్‌, రాజు యాదవ్‌, మల్లం శ్రీనివా్‌స, కొయ్యడ నవీన్‌, నవీన్‌ రెడ్డి, జనార్ధన్‌, నరే్‌ష, ప్రశాంత్‌,ప్రవీణ్‌, శేఖర్‌, కరుణాకర్‌, రాకే్‌ష పాల్గొన్నారు.


 

Updated Date - 2021-06-18T04:29:21+05:30 IST