ఆహ్వానం అందకపోవడంపై కన్నీళ్లు పెట్టుకున్నా : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2020-02-14T21:21:46+05:30 IST

ఈ విషయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన

ఆహ్వానం అందకపోవడంపై కన్నీళ్లు పెట్టుకున్నా : మమత బెనర్జీ

కోల్‌కత్తా : ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి తనను కేంద్రం ఆహ్వానించకపోవడంపై తాను చాలా బాధపడ్డానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ విషయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపానని, దీని కోసం చాలా కష్టపడ్డానని, అలాంటిది ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రం ఆహ్వానించకపోవడం విడ్డూరమని వాపోయారు. ‘‘నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా. కనీసం నాకు సమాచారం అందివ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేశారు’’ అని వాపోయారు. ఈస్ట్- కోస్ట్ రైల్వే కారిడార్‌ను గురువారం కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ ప్రారంభించారు. అయితే ఆహ్వాన పత్రికలో మాత్రం టీఎంసీ నాయకుల పేర్లు ఎక్కడా ప్రచురించక పోవడంతో తృణమూల్ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

Updated Date - 2020-02-14T21:21:46+05:30 IST