కొత్తపల్లిలో ప్రజలిన జ్వరాలు
ABN , First Publish Date - 2021-03-09T06:52:18+05:30 IST
బూదరాళ్ల పంచాయతీ కొత్తపల్లిలో జ్వరాలతోపాటు కొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని గ్రామానికి చెందిన కొర్రా త్రినాథ్ తెలిపారు.
కొంతమందికి వాంతులు, విరేచనాలు
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
తొమ్మిది మందిని రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలింపు
కొయ్యూరు, మార్చి 8: బూదరాళ్ల పంచాయతీ కొత్తపల్లిలో జ్వరాలతోపాటు కొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని గ్రామానికి చెందిన కొర్రా త్రినాథ్ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో మూడేళ్లలోపు చిన్నారులైన కొర్రా ఈషాన్, గెమ్మెలి శ్యామ్యూల్, కొర్రా అయేషా, కీర్తి, మర్రి సువర్ణలతోపాటు మరో ఐదుగురు జ్వరాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. అలాగే గెమ్మెలి కామేశ్వరరావు, మణుగూరు రామన్న, కొర్రా దాలితోపాటు మరో నలుగురు జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నారన్నారు. దీంతో సోమవారం గ్రామంలో రాజేంద్రపాలెం పీహెచ్సీ వైద్యులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తున్నారు. గ్రామానికి చెందిన తొమ్మిది మందిని రాజేంద్రపాలెం పీహెచ్సీలో చేర్పించి, వైద్య సేవలు అందజేస్తున్నారు.