ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2021-05-18T05:12:34+05:30 IST

కొవిడ్‌-19 సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న వేళ ప్రతి ఇంటికీ ఫీవర్‌సర్వే పకడ్బందీగా చేపట్టాలని వైద్య సిబ్బందికి సచివాలయ ఉద్యోగులకు మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ ఆదేశించారు.

ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
ఫీవర్‌సర్వేపై వైద్య సిబ్బందితో ఆరాతీస్తున్న మంత్రి

- మంత్రి శంకర్‌నారాయణ దిశానిర్దేశం

పెనుకొండ రూరల్‌, మే 17: కొవిడ్‌-19 సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న వేళ ప్రతి ఇంటికీ ఫీవర్‌సర్వే పకడ్బందీగా చేపట్టాలని వైద్య సిబ్బందికి సచివాలయ ఉద్యోగులకు మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ ఆదేశించారు. సోమవారం మండలంలోని దుద్దేబండ గ్రామంలో వేరుశనగ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శంకర్‌నారాయణ అకస్మాత్తుగా సచివాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో ఫీవర్‌సర్వే ఏవిధంగా జరుగుతోందని ఎంతమందిని గుర్తించారని సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. 


Updated Date - 2021-05-18T05:12:34+05:30 IST