ఫైబర్ నెట్ కేసు ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావు అరెస్ట్
ABN , First Publish Date - 2021-09-18T20:42:51+05:30 IST
ఫైబర్ నెట్ కేసులో ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అరెస్ట్ చేసింది. వైద్య పరీక్షల కోసం ఆయనను విజయవాడ ప్రభుత్వ
విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అరెస్ట్ చేసింది. వైద్య పరీక్షల కోసం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా సాంబశివరావును సీఐడీ విచారించింది. సాంబశివరావు ఫైబర్ నెట్లో ఎండీగా ఉన్నపుడు టెర్రా సాఫ్ట్వేర్ కంపెనీకి అక్రమ కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా సాంబశివరావు పనిచేశారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్పై వచ్చి ఏపీలో ఆయన పని చేశారు. ఇప్పటికే సాంబశివరావుతో పాటు హరిప్రసాద్ను సీఐడీ విచారించింది. సాంబశివరావుకు వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.