ప్రగతి భవన్లో పంద్రాగస్టు వేడుకలు
ABN , First Publish Date - 2020-08-15T09:40:57+05:30 IST
పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్లో శనివారం జరగనున్నాయి.
10.15 గంటలకు జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్లో శనివారం జరగనున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉదయం 10.15 గంటలకు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాతంత్య్ర వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారు.
మిగతా 32 జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉదయం 10 గంటలకు జెండాను ఆవిష్కరిస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద కూడా స్వాతంత్య్ర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మాస్కులు ఽధరించడం, భౌతిక దూరం, శానిటైజర్ల వాడకం, శానిటైజర్లను స్ర్పే చేయడం వంటి నిబంధనలు పాటిస్తారు.