క్వారంటైన్ సెంటర్లో భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-06-04T19:50:17+05:30 IST
కర్నూలు: కోసిగి క్వారెంటైన్ సెంటర్లో భార్యాభర్తలు మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన భర్త క్వారెంటైన్ సెంటర్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
కర్నూలు: కోసిగి క్వారెంటైన్ సెంటర్లో భార్యాభర్తలు మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన భర్త క్వారెంటైన్ సెంటర్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. క్వారెంటైన్ సెంటర్లో సౌకర్యాలు, డాక్టర్లు లేకపోవడంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్వారెంటైన్ సెంటర్లో దెయ్యం, భూతాలు ఉన్నాయంటూ వలస కూలీలు ఆరోపణలు చేస్తున్నారు.