2 నెలలుగా ఆకలితో పోరాటం
ABN , First Publish Date - 2021-06-18T08:58:18+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ పట్టణంలో 45 ఏళ్ల మహిళ, ఆమె అయిదుగురు పిల్లలు రెండు నెలలుగా ఆకలితో పోరాటం చేశారు.
ఆస్పత్రిలో తల్లి, అయిదుగురు పిల్లలు
అలీఘర్, జూన్ 17: ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ పట్టణంలో 45 ఏళ్ల మహిళ, ఆమె అయిదుగురు పిల్లలు రెండు నెలలుగా ఆకలితో పోరాటం చేశారు. ఎముకల గూళ్లుగా మారిపోయారు. వారికి రేషన్, ఆధార్కార్డులు కూడా లేవు. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ వారిని ఆస్పత్రిలో చేర్చగా కోలుకొంటున్నారు. తన భర్త కరోనాతో మరణించాడని గుడ్డి అనే ఆ మహిళ చెప్పారు. కుటుంబానికి దిక్కైన పెద్ద కొడుకు ఉద్యోగం ఈ ఏడాది పోయింది.