పొలంలో పోరాటం
ABN , First Publish Date - 2021-06-14T05:52:33+05:30 IST
ఆరంభంలోనే మేఘం కరుణించింది. కుండపోత వర్షం పొలాన్ని నిలువునా తడిపేసింది. మట్టి మనిషి మురిసిపోయాడు.
- పశ్చిమ ప్రాంతంలో వర్షం లేక వాడిపోతున్న పత్తి మొలకలు
ఆరంభంలోనే మేఘం కరుణించింది. కుండపోత వర్షం పొలాన్ని నిలువునా తడిపేసింది. మట్టి మనిషి మురిసిపోయాడు. కోటి ఆశలతో పత్తి విత్తనాలు నాటాడు. షరా మామూలే..! మేఘం ముఖం చాటేసింది. మండే ఎండలకు మొలకలు వాడిపోతున్నాయి. వాటి ప్రాణం నిలిపేందుకు బిందెలు, బకెట్లతో నీరు తెచ్చి ఇలా ఒక్కో మొలకను తడుపుతున్నాడు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని బిలేహాల్ గ్రామానికి చెందిన శేషగిరి అనే రైతు కుటుంబం తమ పొలంలో ఆదివారం ఇలా శ్రమిస్తూ కనిపించింది. అరికెర, బిలేహల్, కరడిగూడ్డం, హులేబీడు, నెరణికి తదితర గ్రామాల్లో పత్తి విత్తనం వేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. వర్షం కోసం ఎదురు చూస్తూ.. పంటను కాపాడే పోరాటాన్ని ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు.
- ఆలూరు రూరల్