కరోనాపై పోరులో మేము సైతం
ABN , First Publish Date - 2020-07-16T10:53:45+05:30 IST
కరోనా మహమ్మారి నివారణకు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో పాటు స్వచ్ఛందంగా..
వేలేరుపాడు/పెదపాడు, జూలై 15 : కరోనా మహమ్మారి నివారణకు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో పాటు స్వచ్ఛందంగా తమ వంతు ప్రచారం చేస్తున్నారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ముకు చెందిన తూతిక ప్రకాశరావు వైరస్ చిహ్నంతో సైకిల్పై మైక్ పెట్టుకుని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. పెదపాడు మండలంలో జాతీయరహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద హిజ్రాలు వాహనదా రులకు కరోనాపై అవ గాహన కల్పిస్తున్నారు.