కోవిడ్-19 వ్యాపింపజేస్తున్నందుకు ఫిలిప్పీన్ జాతీయులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-05T20:37:48+05:30 IST

కోవిడ్-19ను వ్యాపింపజేస్తున్నందుకు 10 మంది ఫిలిప్పీన్స్ జాతీయులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

కోవిడ్-19 వ్యాపింపజేస్తున్నందుకు ఫిలిప్పీన్ జాతీయులపై కేసు నమోదు

ముంబై : కోవిడ్-19ను వ్యాపింపజేస్తున్నందుకు 10 మంది ఫిలిప్పీన్స్ జాతీయులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. నవీ ముంబైలోని వసి ప్రాంతంలో వీరిని గుర్తించినట్లు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 188, 269, 270; ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 14; మహారాష్ట్ర కోవిడ్-19 రెగ్యులేషన్స్ సెక్షన్ 11 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 


నిందితులు ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్, తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అనంతరం మార్చి 10 నుంచి 16 వరకు వసిలోని మసీదులో బస చేశారని, ఈ వివరాలను పోలీసులకు తెలియజేయకుండా ఈ మసీదులో వీరు బస చేశారని మహారాష్ట్ర పోలీసులు ఆరోపించారు. ఢిల్లీలోని మత ప్రార్థనల్లో కోవిడ్-19 వ్యాపించినట్లు వీరికి తెలిసినప్పటికీ, వసిలోని మసీదుకు వీరు వచ్చారని తెలిపారు. 


నిందితుల్లో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి వసి మసీదులో కొందరిని కలిసినట్లు, వారికి కూడా కోవిడ్-19 సోకినట్లు తెలిపారు. 


Updated Date - 2020-04-05T20:37:48+05:30 IST