ఫిక్కీ అవార్డుల ప్రదానం
ABN , First Publish Date - 2021-03-05T16:05:18+05:30 IST
ఫిక్కీ అవార్డుల ప్రదానం
హైదరాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 7వ తేదీన చౌమొహల్లా ప్యాలె్సలో వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు ఫిక్కీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఫిక్కీ ఎఫ్ఎల్ఓ జాతీయ మాజీ అధ్యక్షురాలు పింకిరెడ్డి, చైర్పర్సన్ మన్నె ఉషారాణి తెలిపారు. బంజారాహిల్స్ హోటల్ తాజ్ డెక్కన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల్లో రాణించిన 14 మంది మహిళలను గుర్తించామని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో చైర్పర్సన్ అపూర్వజైన్ తదితరులు పాల్గొన్నారు.