సినీ నిర్మాతకు రూ.5 కోట్ల జరిమానా, జైలు
ABN , First Publish Date - 2021-08-02T07:34:29+05:30 IST
రూ.5 కోట్ల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష ఖరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
బెంగళూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): శాండల్వుడ్ నిర్మాత కె.సుధాకర్కు రూ.5 కోట్ల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష ఖరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కథా విచిత్ర, హులిదుర్గ వంటి సినిమాలు నిర్మించిన సుధాకర్పై మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. హాసన్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఆయన రూ.2.90 కోట్లు రుణం తీసుకున్నారు. లే అవుట్ నిర్మాణాల కోసం అప్పు చేసి ఆ సొమ్ముతో సినిమాలకు పెట్టుబడి పెట్టి నిర్మించిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు.
దీంతో సమయానికి అప్పులు చెల్లించలేకపోయారు. రాజీ చేసుకున్న సుధాకర్ చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్ కావడంతో పారిశ్రామికవేత్త హాసన్లోని నాల్గవ జేఎంఎఫ్సీ కోర్టును ఆశ్రయించారు. 2020 జనవరి 27న కోర్టు శిక్షను ఖరారు చేసి తీర్పునిచ్చింది. జేఎంఎ్ఫసీ కోర్టు తీర్పుపై సుధాకర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. హాసన్ జిల్లా కోర్టు సదరు పిటిషన్ను జూలై 16న కొట్టివేయడంతో ఏడాదిన్నర క్రితం జేఎంఎ్ఫసీ కోర్టు తీర్పుకు అనుగుణంగా శిక్షార్హుడయ్యాడు. దీంతో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయింది. సుధాకర్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని హాసన్ జిల్లా పోలీసులు ఆదివారం ప్రకటించారు.