ఎట్టకేలకు వృద్ధురాలికి రేషన బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2021-06-14T06:41:01+05:30 IST

కడుపు మాడ్చుకొని... రేషన కోసం తిరిగి సొమ్మసిల్లిన వృద్ధురాలికి ఎట్టకేలకు అధికారులు ఆదివారం రేషన సరుకులు అందించారు.

ఎట్టకేలకు వృద్ధురాలికి రేషన బియ్యం పంపిణీ
ఇంటికెళ్లి, అందించిన రెవెన్యూ అధికారులు

యాడికి, జూన 13: కడుపు మాడ్చుకొని... రేషన కోసం తిరిగి సొమ్మసిల్లిన వృద్ధురాలికి ఎట్టకేలకు అధికారులు ఆదివారం రేషన సరుకులు అందించారు. స్థానిక సిండికేట్‌ బ్యాంక్‌ కాలనీలో నివాస ముంటున్న ఒంటరి వృద్ధురాలు రమీజాకు రెండు నెలలుగా రేషన సరుకు లు అందలేదు. దీంతో కడుపు కాల్చుకుని బతుకీడుస్తున్న వైనాన్ని ఆంధ్ర జ్యోతిలో ‘కడుపు మాడ్చుకుని.. రేషన కోసం తిరిగి.. సొమ్మసిల్లిన వృద్ధురా లు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు తహసీల్దార్‌ అలెగ్జాండర్‌ స్పందించారు.  వృద్ధురాలి ఇంటి వద్దకు వెళ్లి రేషన సరుకుల కోసం అవ్వ పడుతున్న ఇ బ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఎండీయూ ఆపరేటర్‌, వీఆర్వోలను అక్కడికి పిలిపించారు. అవ్వకు ఇవ్వాల్సిన రేషన సరుకులను తక్షణమే పంపిణీ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి వద్దకే రేషన పంపిణీలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే రెవెన్యూ అ ధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వృద్ధురాలి దీన గాథను వెలుగులోకి తెచ్చిన ఆం ధ్రజ్యోతికి వృద్ధురాలు రమీజా, స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు. 

Updated Date - 2021-06-14T06:41:01+05:30 IST