మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2022-01-27T04:55:38+05:30 IST

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
ఆర్థికసాయం అందజేస్తున్న జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌

కడ్తాల్‌, జనవరి 26: అనారోగ్యంతో మృతిచెందిన రావిచెడ్‌కు చెంది న మహ్మద్‌ సమ్మద్‌ మియా అనే వ్యక్తి కుటుంబాన్ని బుధవారం జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రాధాకృష్ణ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.5వేలు అందజేశారు. పరామర్శించిన వారిలో సర్పంచ్‌లు హరిచంద్‌, సులోచనసాయిలు, ఎంపీటీసీ ల చ్చిరామ్‌, నాయకులు బాలకృష్ణ, రమేశ్‌, లింగం, జమీర్‌, రవి, ఇజాని, సాయికుమార్‌ పాల్గొన్నారు. అలాగే ముద్విన్‌లో పద్మవెంకటమ్మ అనే మహిళ మృతిచెందింది. ఆమె కుటుంబానికి దశరథ్‌ రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్‌ యాదయ్య, వీరయ్య, వినోద్‌, రాజు, వెంకట్‌రెడ్డి, రాఘవరెడ్డి, అనిల్‌రెడ్డి, జంగయ్య ఉన్నారు.

Updated Date - 2022-01-27T04:55:38+05:30 IST