సింగమనేని కొవిడ్ కేంద్రానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-05-16T06:03:59+05:30 IST
సింగమనేని క్వారంటైన కేంద్రంలో కరోనా బాధితుల సౌకర్యాల కోసం రాప్తాడుకు చెందిన యువకులు ఆర్థిక సహాయం అందించా రు.
రాప్తాడు, మే 15: సింగమనేని క్వారంటైన కేంద్రంలో కరోనా బాధితుల సౌకర్యాల కోసం రాప్తాడుకు చెందిన యువకులు ఆర్థిక సహాయం అందించా రు. రాప్తాడుకు చెం దిన వలంటీర్ దండు బీరప్ప, శేఖర్, సూరి రూ. 5వేలు నగదును రాప్తాడు ఎస్ఐ ఆంజ నేయులు చేతుల మీదుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డికి అందజేశారు. ఈ ససందర్భంగా యువకులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో కరోనా బాధితులకు సౌకర్యాలు కల్పించేందుకు సీపీఎం అనుబంధ సంఘాలు క్వారంటైన కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.