కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-12-02T05:06:34+05:30 IST
ఇటీవల నెల్లూ రు జిల్లాలో వరద సహా యక చర్యల్లో పాల్గొని మృతి చెందిన కందిశ గ్రామా నికి చెందిన ఎన్డీ ఆర్ఎఫ్ కానిస్టేబుల్ కెల్ల శ్రీనివాస రావు కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల చెక్కును కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ సత్యం మృతుని భార్య సునీతకు అందజేశారు.
రేగిడి: ఇటీవల నెల్లూరు జిల్లాలో వరద సహా యక చర్యల్లో పాల్గొని మృతి చెందిన కందిశ గ్రామా నికి చెందిన ఎన్డీ ఆర్ఎఫ్ కానిస్టేబుల్ కెల్ల శ్రీనివాస రావు కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల చెక్కును కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ సత్యం మృతుని భార్య సునీతకు అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తహసీల్దార్ సంతాపం తెలిపి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు మన్మథరావు, పంచాయతీ కార్యదర్శి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.