ఆర్థిక సంఘం నిధులు రూ. 39.2 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-08-11T10:47:38+05:30 IST

గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడత రూ.39.2 కోట్లు విడుదలయ్యాయి.

ఆర్థిక సంఘం నిధులు రూ. 39.2 కోట్లు విడుదల

ఏలూరు సిటీ, ఆగస్టు 10: గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడత రూ.39.2 కోట్లు విడుదలయ్యాయి. నిధులు కేటాయించి పది రోజులు కావస్తున్నా ఇంత వరకు నిధుల వినియోగంపై మార్గదర్శకాలు జారీ కాలేదు. మార్గ దర్శకాలు లేకపోవడంతో విడుదలైన నిధులు సంబంధిత పంచాయతీలకు కేటాయింపు కాలేదు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా రూ. 39,20,88,999 కేటాయించిటన్లు అధికారులు  చెబుతున్నారు. ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమకానున్నాయి. మా ర్గదర్శకాలు జారీ అయితే పంచాయతీలకు కొంత ఊరట.

Updated Date - 2020-08-11T10:47:38+05:30 IST