రమేష్ హాస్పిటల్, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాలపై ఎఫ్ఐఆర్
ABN , First Publish Date - 2020-08-09T18:34:23+05:30 IST
స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో...
విజయవాడ: నగరంలో ఆదివారం తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో పోలీసులు రమేష్ హాస్పిటల్, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. విచారణ వేగవంతం చేశారు. 304, 308 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్వర్ణ ప్యాలెస్ను రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్గా వినియోగిస్తోంది.