భారీ అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2021-01-26T06:01:10+05:30 IST
మండలంలోని యర్రబాలెం పంచాయతీ పరిధి పారిశ్రామికవాడ సమీపంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
20 పూరి గుడిసెలు దగ్థం
మంగళగిరి, జనవరి 25: మండలంలోని యర్రబాలెం పంచాయతీ పరిధి పారిశ్రామికవాడ సమీపంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. బాధితులంతా కూలిపనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం సంభవించడంతో వారంతా కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10లక్షల ఆస్తినష్టం సంభవించగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలను తహసీల్దార్ జీవీ రామ్ప్రసాద్, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ ఈవోలు కోటిరెడ్డి, కుమార్, వీఆర్వో అనిత తదితరులు పరామర్శించారు.