జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-26T05:44:52+05:30 IST
పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్తో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది.
భైంసా క్రైం, నవంబరు 25 : పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్తో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లో వెళితే గత 20 రోజుల నుంచి భైంసా పట్టణంలో సీసీఐ ద్వారా పలు ఫ్యాక్టరీలలో పత్తి కొనుగోలు నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగా ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో కొనుగోళ్లు జరుపుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు పత్తిలో పడ డంతో మంటలు అంటుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. ఈ సంఘటన స్థలాన్ని సీసీఐ అధికారి సోలంకి, పట్టణ సీఐ వేణుగోపాల్రావ్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకొని నష్టాన్ని అంచనా వేసి సుమారు 10 క్వింటాళ్ల వరకు కాలినట్లు గుర్తించారు.