టీడీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్‌

ABN , First Publish Date - 2021-10-01T23:44:41+05:30 IST

టీడీపీ నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు. కొందరు నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పార్టీకి అప్రతిష్ట

టీడీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్‌

అనంతపురం: టీడీపీ నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు. కొందరు నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను అయోమయం గురిచేస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని తప్పుబట్టారు. ఈ విధమైన పోకడలను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2021-10-01T23:44:41+05:30 IST