దర్గాలోని వస్తువులకు నిప్పు

ABN , First Publish Date - 2021-01-18T07:57:18+05:30 IST

చిత్తూరు జిల్లాలో దర్గాపై దాడి సంచలనం కలిగించింది. గంగవరం మండలం దండపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె సమీపంలోని సయ్యద్‌ షాహి జిలానీ వల్లీ బాబా దర్గా లోపలకు శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రవేశించారు. దర్గాలోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఓ పెట్టె, అందులోని కొన్ని పుస్తకాలు కాలిపోయాయి.

దర్గాలోని వస్తువులకు నిప్పు

చిత్తూరు జిల్లాలో దుండగుల దుశ్చర్య 


పలమనేరు, జనవరి 17: చిత్తూరు జిల్లాలో దర్గాపై దాడి సంచలనం కలిగించింది. గంగవరం మండలం దండపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె సమీపంలోని సయ్యద్‌ షాహి జిలానీ వల్లీ బాబా దర్గా లోపలకు శనివారం రాత్రి కొందరు దుండగులు ప్రవేశించారు. దర్గాలోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఓ పెట్టె, అందులోని కొన్ని పుస్తకాలు కాలిపోయాయి. ఆదివారం ఉదయం దర్గాకు వెళ్లిన నిర్వాహకుడు జిలానీ బాషా కాలిపోయిన వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ గంగయ్య, సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి దర్గాకు చేరుకుని పరిశీలించారు. కేసును 17/2021 నంబరుతో సెక్షన్లు 457, 435, 295/ఏ ఐపీసీ కింద నమోదు చేశారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-01-18T07:57:18+05:30 IST