మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రం.. రక్షించిన వ్యక్తికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-06-19T22:21:11+05:30 IST

మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రం.. రక్షించిన వ్యక్తికి అస్వస్థత

మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రం.. రక్షించిన వ్యక్తికి అస్వస్థత

గుజరాత్: మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రాన్ని అత్యంత సాహసోపేతంగా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది. వోరా వంతెన సమీపంలో రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలో ఉన్న ఆజీ నదిలో ఎనిమిది అడుగుల లోతులో ఉన్న బురదలో గుర్రం చిక్కుకుంది. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన ఆలయ పూజారి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ 45 నిమిషాల పాటు సాగింది. ట్యూబ్ సాయంతో గుర్రం ఉన్న ప్రాంతానికి అతి కష్టం మీద పాకుతూ వెళ్లిన వ్యక్తి దాని మెడకు తాడు కట్టి బయటకు లాగారు. సజీవంగా గుర్రం బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో రెస్క్యూ చేసిన వ్యక్తి నదిలోని కాలుష్య వాయువులు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. 

Updated Date - 2021-06-19T22:21:11+05:30 IST