డంపింగ్ యార్డులో మంటలు
ABN , First Publish Date - 2021-05-11T06:01:30+05:30 IST
నగర శివారు బైపాసు రోడ్డులోని మున్సిపల్ డం పింగ్యార్డులో సోమవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
దట్టంగా కమ్ముకున్న పొగ
ఫైరింజన్లు, ట్యాంకర్లతో నీటిని చల్లి
అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బంది
కరీంనగర్ టౌన్, మే 10: నగర శివారు బైపాసు రోడ్డులోని మున్సిపల్ డం పింగ్యార్డులో సోమవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనితో ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుంది. మంటలు వేగంబగా వ్యాప్తిచెందడంతో పరిసరాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ము న్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి వెంటనే అక్కడికి వెళ్లి మంటలను అదపులో కి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అగ్నిమాపకశాఖకు స మాచారమివ్వడంతో రెండు ఫైర్ఇంజన్లు,డీఆర్ఎఫ్ సిబ్బందితో మున్సిపల్ ట్యాం కర్ల ద్వారా మంటలపై నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతివేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినపుడు చెత్త అంటుకొని డంపింగ్యార్డులో మంటలు వ్యాప్తిచెందుతున్నాయన్నారు. స్మార్ట్సిటీ పథకం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంచూపుతామని చెప్పారు.