డంపింగ్‌ యార్డులో మంటలు

ABN , First Publish Date - 2021-05-11T06:01:30+05:30 IST

నగర శివారు బైపాసు రోడ్డులోని మున్సిపల్‌ డం పింగ్‌యార్డులో సోమవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

డంపింగ్‌ యార్డులో మంటలు
డంపింగ్‌యార్డులో ఎగసి పడుతున్న మంటలు

 దట్టంగా కమ్ముకున్న పొగ

 ఫైరింజన్లు, ట్యాంకర్లతో నీటిని చల్లి 

అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక, మున్సిపల్‌ సిబ్బంది


కరీంనగర్‌ టౌన్‌, మే 10: నగర శివారు బైపాసు రోడ్డులోని మున్సిపల్‌ డం పింగ్‌యార్డులో సోమవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనితో ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుంది. మంటలు వేగంబగా వ్యాప్తిచెందడంతో పరిసరాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ము న్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి వెంటనే అక్కడికి వెళ్లి మంటలను అదపులో కి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అగ్నిమాపకశాఖకు స మాచారమివ్వడంతో రెండు ఫైర్‌ఇంజన్లు,డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో మున్సిపల్‌ ట్యాం కర్ల ద్వారా మంటలపై నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతివేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినపుడు చెత్త అంటుకొని డంపింగ్‌యార్డులో మంటలు వ్యాప్తిచెందుతున్నాయన్నారు. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంచూపుతామని చెప్పారు. 

Updated Date - 2021-05-11T06:01:30+05:30 IST