Firing:ఢిల్లీ కోర్టు లోపల కాల్పులు...ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-07-13T16:43:13+05:30 IST

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉన్న కోర్టు లోపల సోమవారం రాత్రి కాల్పులు జరిగాయి....

Firing:ఢిల్లీ కోర్టు లోపల కాల్పులు...ఒకరి మృతి

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉన్న కోర్టు లోపల సోమవారం రాత్రి కాల్పులు జరిగాయి. కోర్టు ఛాంబరులోపల పలువురు న్యాయవాదులు, కక్షిదారుల సమక్షంలోనే న్యాయవాది అరుణ్ శర్మ తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఉప్ కార్ అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో మరణించారు.కోర్టులో కాల్పులు జరిపిన నిందితుడు పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ కేసులో విచారణకు వచ్చిన ఉప్ కార్ మరణించాడు.దేశ రాజధాని నగరంలోనే కోర్టు లోపల కాల్పుల జరిగిన ఘటన కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-13T16:43:13+05:30 IST