ఆర్ఆర్‌టీఎస్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల... గంటకు 180 కిలోమీటర్ల పరుగు!

ABN , First Publish Date - 2020-09-26T12:24:01+05:30 IST

రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్) ట్రైన్ ఫస్ట్‌లుక్ విడుదలయ్యింది. భారత్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి రైలు కానుంది.

ఆర్ఆర్‌టీఎస్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల... గంటకు 180 కిలోమీటర్ల పరుగు!

న్యూఢిల్లీ: రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్) ట్రైన్ ఫస్ట్‌లుక్ విడుదలయ్యింది. భారత్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి రైలు కానుంది. ఈ ట్రైన్ నిర్మాణం పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ తరహాలో రూపొందనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఈ రైలు ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్రమంతి దుర్గాశంకర్ మిశ్రా మాట్లాడుతూ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న ఆత్మనిర్భర్ భారత్‌కు చెందిన ఐదు స్తంభాలలో ఒకటని అన్నారు. ఇది దేశానికే గర్వకారణమని అన్నారు. ఆర్ఆర్‌టీఎస్ కోసం రూపొందించే అత్యుత్తుమ రైళ్లు మేక్ ఇన్ ఇండియా ధ్యేయంతో రూపొందుతున్నాయన్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందే ఈ రైళ్లు పర్యావరణానికి అనుకూలమైనవని అన్నారు. కాగా 2022 నాటికి ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - 2020-09-26T12:24:01+05:30 IST