‘ఆర్టీసీ చరిత్రలోనే ఇది మొదటిసారి..’
ABN , First Publish Date - 2021-03-06T12:24:46+05:30 IST
ఆర్టీసీ చరిత్రలో ఉద్యోగులను సన్మానించడం ఇదే మొదటిసారని
హైదరాబాద్/రాంగోపాల్పేట్ : ఆర్టీసీ చరిత్రలో ఉద్యోగులను సన్మానించడం ఇదే మొదటిసారని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రాణీగంజ్ 1, 2 డిపోల సంయుక్తాధ్వర్యంలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లను సన్మానించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ యుగంధర్, రాంగోపాల్పేట్ ఇన్స్పెక్టర్ టీసీహెచ్ బాబు, మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్యాదవ్, తిరుమలగిరి ఎంవీఐ జె. శ్రీనివాస్, డిపోల మేనేజర్లు ఉమామహేశ్వర్రావు, భీంరెడ్డి, జగన్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.