అర్హులందరికీ మత్స్యకార భరోసా
ABN , First Publish Date - 2021-04-20T04:34:52+05:30 IST
అర్హులైన మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా అందించనున్నట్టు మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి తెలిపారు. కొండ్రాజుపాలెం, ముక్కాం, చేపలకంచేరు తదితర గ్రామాల్లో సోమవారం బోట్ల గణన ప్రారంభమైంది. పర్యవేక్షించిన డీడీ మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికిగాను రూ
మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి
భోగాపురం, ఏప్రిల్ 19: అర్హులైన మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా అందించనున్నట్టు మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి తెలిపారు. కొండ్రాజుపాలెం, ముక్కాం, చేపలకంచేరు తదితర గ్రామాల్లో సోమవారం బోట్ల గణన ప్రారంభమైంది. పర్యవేక్షించిన డీడీ మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికిగాను రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ పథకం వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. అందుకే బోట్లు గణనకు వచ్చే అధికారులు, సిబ్బందికి సరైన వివరాలు అందించాలన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతా నంబరుతో పాటు గుర్తింపు పత్రాలు అందజేయాలన్నారు. 728 బోట్లకు సంబంధించి 2,998 మంది మత్స్యకారులను గుర్తించామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ కిరణ్కుమార్, మత్స్యశాఖ సహాయకులు షరీఫ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.