బీరుట్ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ భారత పౌరులు!

ABN , First Publish Date - 2020-08-07T08:03:22+05:30 IST

లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో మంగళవారం సాయంత్రం

బీరుట్ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ భారత పౌరులు!

న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐదగురు భారత పౌరులు స్వప్పంగా గాయపడ్డట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. లెబనాన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో.. అక్కడి భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురు భారత పౌరులు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా.. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. లెబనాన్‌లో దాదాపు 9వేల మంది భారతీయులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 137కు చేరుకుంది. 


Updated Date - 2020-08-07T08:03:22+05:30 IST